చైనాలో ఒక్క రోజే 3.7 కోట్ల కరోనా కేసులు
- December 24, 2022
చైనా: కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతుంది. కరోనా పుట్టినిల్లు చైనా లో మరోసారి తీవ్ర రూపం దాల్చుతుంది. ఒక్క రోజే దాదాపు 3.7 కోట్ల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒకే రోజున కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన 4 కోట్ల మందికన్నా కూడా ప్రస్తుత సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని చైనా ఆరోగ్య వాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని బీజింగ్తో పాటుగా సిచువాన్ ప్రావిన్స్లో సగానికి పైగా నివాసితులు కరోనా బారిన పడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న చైనాలోని 18 శాతం జనాభాకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కరోనా ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఈ స్థాయి కేసులు నమోదుకావడం కూడా ఇదే తొలిసారి. ఈ కథనం ప్రకారం.. డిసెంబర్లో మొదటి 20 రోజుల్లో 24.8 కోట్ల మంది చైనా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపుగా 18 శాతం. చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ అంతర్గత సమావేశంలో అధికారులు ఈ అంచనా వేశారు. ఈ సమావేశం వివరాలు బయటకు పొక్కడంతో ఈ లెక్కలు బహిర్గతమయ్యాయి. మరోపక్క అన్ని దేశాలు కరోనా ఆంక్షలు స్టార్ట్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







