ఖతీఫ్లో హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
- December 24, 2022
జెడ్డా: తూర్పు ప్రావిన్స్లోని ఖతీఫ్ గవర్నరేట్లో హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అధికారులు తెలిపారు. ఖతీఫ్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా వారి వాహనంతో ఒక వ్యక్తిపైకి దూసుకెళ్లి అతని వ్యక్తిగత వస్తువులను దొంగిలించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు నేరం చేసినట్లు ఒప్పుకున్నారని తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. "ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని చంపి, దోచుకోవడానికి ప్రయత్నించారని దర్యాప్తులో వెల్లడైంది. ఆపై వారిపై విచారణను పూర్తి చేయడానికి, సమర్థ కోర్టుకు వారిని రిఫర్ చేయడానికి సన్నాహకంగా వారిని అదుపులోకి తీసుకున్నారు" అని ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







