విదేశీ ప్రయాణికులపై భారత్ ఆంక్షలు.. ఆ దేశాల వారికి ఆర్‌టి-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి

- December 24, 2022 , by Maagulf
విదేశీ ప్రయాణికులపై భారత్ ఆంక్షలు.. ఆ దేశాల వారికి ఆర్‌టి-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తిరిగి ప్రారంభం కావడంపై భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఐదు దేశాల నుండి వచ్చేవారికి ఆర్‌టి-పిసిఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్‌కు చెందిన ప్రయాణికులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులలో పాజిటివ్‌గా తేలినా లేదా కోవిడ్-19 లక్షణాలను గుర్తించిన వారిని క్వారంటైన్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి

ప్రస్తుత ఆరోగ్య స్థితిని ప్రకటించడానికి ఎయిర్ సువిధ ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుందని తెలిపారు. నిన్న దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం అప్డేట్ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.  దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా శుక్రవారం ట్విటర్‌లో కొత్త మార్గదర్శకాలను షేర్ చేసింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com