విదేశీ ప్రయాణికులపై భారత్ ఆంక్షలు.. ఆ దేశాల వారికి ఆర్టి-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి
- December 24, 2022
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తిరిగి ప్రారంభం కావడంపై భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఐదు దేశాల నుండి వచ్చేవారికి ఆర్టి-పిసిఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్లాండ్కు చెందిన ప్రయాణికులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులలో పాజిటివ్గా తేలినా లేదా కోవిడ్-19 లక్షణాలను గుర్తించిన వారిని క్వారంటైన్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి
ప్రస్తుత ఆరోగ్య స్థితిని ప్రకటించడానికి ఎయిర్ సువిధ ఫారమ్ను పూరించాల్సి ఉంటుందని తెలిపారు. నిన్న దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం అప్డేట్ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా శుక్రవారం ట్విటర్లో కొత్త మార్గదర్శకాలను షేర్ చేసింది.
Latest guidelines for international arrival in India. pic.twitter.com/GBjQPTx64V
— India in Dubai (@cgidubai) December 23, 2022
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







