నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారులకు అలర్ట్
- December 27, 2022
న్యూ ఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారులకు అలర్ట్. 2023 జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. వివరాల్లోకి వెళితే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో పలు మార్పులు చేస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిర్ణయం తీసుకుంది.
ఎన్ పీఎస్ చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆన్ లైన్ లో పాక్షికంగా డబ్బు తీసుకునే అవకాశాన్ని తొలగించింది. కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు ఉండటంతో.. జనవరి 1 నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తో పాక్షిక ఉపసంహరణ చేసుకునే ఛాన్స్ నిలిచిపోతుంది. మూడేళ్ల ఎన్ పీఎస్ చందాదారులు.. డాక్యుమెంట్లు సమర్పించి, కంట్రిబ్యూషన్ లో 25శాతం లోపు డబ్బు డ్రా చేసుకోవచ్చు.
”నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఉపసంహరణకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఇటీవల కొత్త ఆర్డర్ను జారీ చేసింది. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ రంగాల చందాదారులు తమ అనుబంధ నోడల్ కార్యాలయాల ద్వారా పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తును సమర్పించాలి. ఇందులో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర/రాష్ట్ర స్వయంప్రతిపత్తి సంస్థల చందాదారులు ఉన్నారు. ఇది జనవరి 1, 2023 నుండి వర్తిస్తుంది” అని అధికారులు వెల్లడించారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులుగా ఉన్న సమాఖ్య, రాష్ట్ర మరియు కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు ఇకపై స్వీయ ప్రకటన ద్వారా తమ NPS ఖాతాల నుండి పాక్షికంగా నిధులను విత్డ్రా చేయలేరు. పబ్లిక్ సెక్టార్లోని చందాదారులు ఇప్పుడు సంబంధిత నోడల్ ఏజెన్సీల ద్వారా పాక్షిక ఉపసంహరణల కోసం తమ అభ్యర్థనలను సమర్పించాలి.
కాగా..కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వ రంగ చందాదారులు ఎన్పిఎస్ ఖాతాల నుండి పాక్షిక ఉపసంహరణలను స్వీయ ప్రకటన(సెల్ఫ్ డిక్లరేషన్) ద్వారా పెన్షన్ ఫండ్ అథారిటీ అనుమతించింది. అయితే, ఇప్పుడు కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని తొలగించారు అధికారులు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







