ఫేస్బుక్ మరో యాప్ను తీసుకొస్తోంది
- April 27, 2016
సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో యాప్ను తీసుకొస్తోంది. వినియోగదారులు ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ.. వీడియోలను ప్రత్యక్షప్రసారంలో స్నేహితులతో పంచుకునేందుకు వీలుగా సరికొత్త కెమెరా యాప్ను రూపొందిస్తోంది.
ప్రస్తుతం సోషల్మీడియాలో లైవ్స్ట్రీమింగ్ ట్రెండ్ జోరందుకుంది. పెరిస్కోప్.. మీర్క్యాట్.. స్నాప్చాట్ తదితర ప్రత్యక్షప్రసారాల యాప్ల వాడకం పెరిగిపోతోంది. పెరిస్కోప్ యాప్తో మన కళ్లముందు జరిగే ప్రతి సన్నివేశాన్నీ చిత్రీకరిస్తూ ట్విట్టర్లో ప్రత్యక్షప్రసారం చేసుకునే వీలుంది. అలాగే.. స్నాప్చాట్ యాప్తోనూ లైవ్ వీడియోలను షేర్ చేసుకోవచ్చు. అయితే.. ఈ విషయంలో సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాత్రం కాస్త వెనకబడి ఉందట.
ఎఫ్బీలోనూ లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చినా.. దాన్ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య వూహించిన స్థాయిలో పెరగడం లేదని చెబుతున్నారు. చాలా మంది రోజూ ప్రొఫైళ్లు చూసుకుంటున్నా.. ఫొటోలు.. వీడియోల షేరింగ్ మాత్రం తగ్గింది. 2015తో పోల్చితే 2016 తొలి త్రైమాసికంలో 9 శాతం తక్కువ వీడియోలను.. ఫొటోలను షేర్ చేసినట్లు ఓ సంస్థ జరిపిన పరిశోధనలో తేలింది.
ఇక ఈ కెమెరా యాప్తో యూజర్లను ఆకట్టుకునే వీలుంటుందని ఫేస్బుక్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ యాప్ను లండన్లోని ఫేస్బుక్కి చెందిన 'షేరింగ్' బృందం అభివృద్ధి చేస్తున్నట్లు వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







