కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోలు పై నిషేధం
- January 02, 2023
ఓటవా: కెనడాలో విదేశీయులు ఇళ్లు కొనకుండా విధించిన నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. స్థానికులకు ఇళ్ల కొరత సమస్య ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మరిన్ని ఇళ్లు వారికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. శాశ్వత నివాసం కలిగిన వారు, శరణార్థులకు దీని నుంచి మినహాయింపు నిచ్చారు. రెండేళ్ల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. డిమాండ్ కు సరిపడా ఇళ్ల లభ్యత లేకపోవడంతో ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.దీంతో 2021 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఇచ్చిన హామీ మేరకు తాజా నిషేధాన్ని అమల్లో పెట్టారు.
కెనడా సెంట్రల్ బ్యాంకు రేట్లను గణనీయంగా పెంచడంతో రుణాలపై ఇళ్లు కొన్న వారు భారంగా భావించి విక్రయాలకు మొగ్గు చూపిస్తుండడంతో.. 2022 ఆరంభం నుంచి చూస్తే సగటున ఒక్కో ఇంటి ధర రూ.8 కోట్ల నుంచి రూ.5.9 కోట్లకు తగ్గింది. జనాభాలో కేవలం 5 శాతంగా ఉన్న విదేశీయులు కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం వల్ల ఇళ్ల లభ్యత పెద్దగా పెరగబోదని, దీనికి బదులు మరిన్ని ఇళ్లను నిర్మించడం పరిష్కారమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







