26వ అఖిల భారత నాటకోత్సవాలు
- April 28, 2016
తెలుగు సినిమా తనకు అమ్మలాంటిదని, తెలుగు నాటక రంగం పెద్దమ్మ లాంటిదని ప్రముఖ సినీ నటుడు,'మా'అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో పరుచూరి రఘుబాబు స్మారకార్థం నిర్వహిస్తున్న 26వ అఖిల భారత నాటకోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఏడురోజులపాటు ఈ నాటకోత్సవాలు జరుగుతాయి. ఈ సభలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏ వేదిక అయితే తమకు గుర్తింపునిచ్చిందో దాన్ని మరువకుండా నాటక కళాపరిషత్తులు నిర్వహించడం అభినందనీయమన్నారు. నాటకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు పరుచూరి బ్రదర్స్ పడుతున్న శ్రమ శ్లాఘనీయమన్నారు. పరుచూరి రఘుబాబు పరమపదించి 26 ఏళ్లయినా నిజమైన హీరోగా వెలుగొందుతున్నారని చెప్పారు.ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మానసిక రుగ్మతలను సైతం నయం చేసి మనిషిని తేజోవంతం చేసే గుణం నాటకానికి ఉందన్నారు. తొలుత పరుచూరి రఘుబాబు చిత్రపటానికి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో స్థల దాత వేములపల్లి సుబ్బారావు, వేద గంగోత్రి ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ జీవీఎన్ఆర్ఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి 'జీవితార్ధం' నాటకం, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి 'రంకె' నాటిక, లిఖిత సాయి క్రియేషన్స్ గోవాడ వారి 'పంపకాలు'నాటిక ప్రదర్శించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







