మే 1వ తేదీన వారణాశిలో 11 ఈ-బోట్లను ఆవిష్కరించనున్నా మోదీ.
- April 28, 2016
భారతదేశంలోనే మొదటిసారిగా ఈ-బోట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ-పడవలను ఆయన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాశిలో వచ్చే ఆదివారం ప్రారంభించనున్నారు. హెరిటేజ్ సిటీగా పేరొందిన వారణాశిలో కాలుష్యం తగ్గించేందుకు ఓ ప్రయత్నంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
మే 1వ తేదీన మోదీ వారణాశిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా గంగా ఘాట్ వద్ద ఉన్న నిషాద్ కమ్యూనిటీ వారితో ఆయన మాట్లాడతారు. తొలి దశలో 11 ఈ-బోట్లను ఆవిష్కరించనున్నారు. సంప్రదాయ పడవల స్థానంలో బ్యాటరీలతో నడిచే ఈ- పడవలను భర్తీ చేయనున్నారు. సంవత్సరంలోపు దాదాపు 3వేల ఈ- పడవలను ప్రవేశపెట్టడం లక్ష్యం.ఈ పడవలకు తెడ్డు వేసే పని ఉండదు. స్టీరింగ్ తిప్పితే చాలు. సౌరశక్తితో చార్జి అయ్యే బ్యాటరీలతో ఇవి నడుస్తాయి. వంద శాతం పర్యావరణానికి హాని కలిగించని విధంగా వీటిని రూపొందించారు. డీజిల్ ఇంజిన్ ఉండదు కాబట్టి ఇవి నడిచేటప్పుడు శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







