యూఏఈలో చమురు ధరల పెంపు
- April 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మే నెల కోసం చమురు ధరల్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరగనున్న ధరల వివరాల్ని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఇ-ప్లస్ 91 లీటర్ ధర 1.60 దిర్హామ్లు కాగా, సూపర్ 98 ధర 1.78 దిర్హామ్లు. స్పెషల్ 95 ఫ్యూయల్ 1.67 దిర్హామ్లకు లభిస్తుంది. డీజిల్ ధర లీటర్ 1.60 దిర్హామ్లు. ఏప్రిల్తో పోల్చితే అన్ని ధరలూ పెంచబడ్డాయి. 2015 జులై నుంచి ప్రభుత్వం ఫ్యూయల్ ధరల్ని డిరెగ్యులైజేషన్ చేస్తూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్కి తగ్గట్టుగా ఫ్యూయల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పెరిగిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







