ఏపీలో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత
- January 06, 2023
విశాఖపట్నం: విశాఖ లోని గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు పాటించకుండా నిర్మాణం జరిగిందని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామునుండి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు చేపట్టారు. .
ఉదయం ఆ ప్రాంతం మీదు వెళ్లే ప్రయాణికులు, ప్రజలు ఒక్కసారి షాక్ అయ్యారు. రాత్రికి రాత్రే ఇలా బారికేడ్లు పెట్టి రాకపోకలకు అంతరాయం కల్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎండాడ, రుషి కొండవైపు రాకపోకలు నిలిపేశారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారో అనే సమాచారం మాత్రం ఎవరికీ తెలియక తికమక పడ్డారు.
గీతం యాజమాన్యం కూడా తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. పోలీసులు ఎందుకు వచ్చారో కూడా తమకు తెలియదని చెబుతోంది. ఈ హైడ్రామా కొనసాగిన కాసేపటికి ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మాణాలు తొలగింపు చేపట్టారు. దీంతో విషయం అందరికీ అర్థమైంది. ఈ కట్టడాల తొలగింపునకు గతంలోనే ప్రభుత్వం యత్నించింది. అనుమతికి మించి ఈ కట్టడాలు నిర్మించారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకే కట్టడాలను కూల్చేస్తున్నట్టు అప్పట్లో పేర్కొంది. దీని పై కోర్టుకు వెళ్లిన గీతం యాజమాన్యం స్టే తెచ్చుకుంది. ఆ స్టే గడువు ముగియడంతో ఇప్పుడు మరోసారి నిర్మాణాలు పడగొట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









