పర్వతారోహణలో అపశృతి.. కిందపడి పౌరుడు మృతి

- January 08, 2023 , by Maagulf
పర్వతారోహణలో అపశృతి.. కిందపడి పౌరుడు మృతి

మస్కట్: ఖురియత్ విలాయత్‌లో పర్వతం నుండి పడిపోయిన పౌరుడి మృతదేహాన్ని వెలికితీసినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. మస్కట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్‌ల శాఖ బృందాలు ఖురియత్ విలాయత్‌లోని పర్వతం నుండి పడిపోయిన పౌరుడి ప్రమాద సమాచారంపై స్పందించాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఏవియేషన్ సహకారంతో బృందాలు కష్టతరమైన పర్వత ప్రాంతానికి చేరుకుని, ఆ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినట్లు సీడీఏఏ పేర్కొంది. హైకర్లు, పర్వతారోహకులు సాహస యాత్రకు వెళ్లే ముందు తమ వివరాలను NIDAA యాప్‌లో నమోదు చేసుకోవాలని సీడీఏఏ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com