డిజైన్ పోటీని ప్రకటించిన సయ్యద్ బిలారబ్
- January 09, 2023
మస్కట్: ఎక్స్పో 2025 జపాన్ కోసం ఒమన్ పెవిలియన్ను రూపొందించడానికి పోటీని ప్రారంభించినట్లు హిస్ హైనెస్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్ ప్రకటించారు. సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖతో కలిసి ఆర్కిటెక్చరల్ డిజైన్కు బిలారబ్ బిన్ హైతం అవార్డు (BHA) ద్వారా పోటీ విజేతలను నిర్ణయిస్తారు. ఈ పోటీలో పెద్ద సంఖ్యలో పౌరులు పాల్గొనేందుకు వీలుగా ఆర్కిటెక్చర్, డిజైన్, అర్బన్ ప్లానింగ్ రంగాల్లోని నిపుణులపై ఎటువంటి వయో పరిమితులు విధించబడలేదని ఆయన ధృవీకరించారు. పాల్గొనేవారు పోటీలో వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా పాల్గొనవచ్చు. స్థానిక కన్సల్టేషన్ కార్యాలయాలు కూడా పోటీలో చేరవచ్చు. గ్లోబల్ మ్యాప్లో ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంచే లక్ష్యంతో ఈ జాతీయ ప్రాజెక్ట్లో చొరవ తీసుకోవాలని హెచ్హెచ్ సయ్యద్ బిలారబ్ యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలలో ఒమన్ పెవిలియన్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్ హోదాకు తగిన ప్రముఖ ఎంట్రీలను ఈ పోటీ సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీల ఫలితాలను ఫిబ్రవరి 2023 నెలలో ప్రకటిస్తారు. ఒమన్ పెవిలియన్ కోసం 1,763 చదరపు మీటర్ల విస్తీర్ణం కేటాయించబడింది. విజేతకు ప్రాజెక్టుకు OMR10,000 నగదు బహుమతిని అందజేస్తారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









