ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్ముకున్న పొగ మంచు..
- January 09, 2023
న్యూ ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను పొగ మంచు కమ్మేస్తోంది.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది.పొగమంచు ప్రభావం రవాణా వ్యవస్థపై పడుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంను పొగమంచు కమ్మేసింది.
దీంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు విమానాశ్రయంలోనే నిలిచిపోయాయి.దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.విమానాశ్రయం పరిధిలో దారి కనిపించకపోవడంతో మూడు విమానాలను అధికారులు దారి మళ్లించారు. షార్జా నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంతోపాటు, అహ్మదాబాద్, పూనేల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాల్ని జైపూర్ పంపించారు.
భారత వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. పంజాబ్, రాజస్థాన్, బిహార్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లో పొగ మంచు పొరలాగా కమ్ముకున్నట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పొగ మంచు ప్రభావంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ఈ విషయం పై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని, దీనికోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ రేటు ఉదయం ఐదున్నర గంటల సమయంలో 0 మీటర్లుగా ఉందంటే అక్కడి పరిస్థితిని అంచనావేయొచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







