హైదరాబాద్ లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం
- January 12, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ , బిజినెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుపుగా..ఇప్పుడు మరోసారి సోదాలు మొదలుపెట్టారు. బాల నగర్ లోని పలు కెమికల్ కంపెనీలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు కెమికల్ కంపెనీలకు సంబంధించి మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ రెండు కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు సమాచారం అందటంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. కాగా.. ఢిల్లీ నుంచి మొత్తం ఆరు బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. వారం రోజుల కిందట హైదరాబాద్లో పలు చోట్ల ఐటీ శాఖ సోదాలు కలకలం రేపాయి. సుమారు 20 బృందాలుగా ఏర్పడిన 60 మంది ఐటీ అధికారులు.. ఒకేసారి వివిధ చోట్ల దాడులు నిర్వహించారు.
గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్ఫ్రా, ఐటీ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ను ఎక్సెల్ గ్రూప్ నడుపుతోంది. అలాగే.. బాచుపల్లి, చందానగర్, కోకాపేట, బాబుఖాన్ లేక్ ఫ్రంట్ విల్లాస్లోని అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరపటం చర్చనీయంగా మారింది.
తాజా వార్తలు
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
- టీవీకే ఆధిక్యం..విజయ్ ఇంట్లో మిన్నంటిన సంబరాలు!
- ఐపీఎల్ 2026..టాప్ 4 జట్లకు గట్టి పోటీ!
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!









