పాకిస్తాన్ లో పెట్టుబడి మార్గాలు వెతకండి: సౌదీ ప్రిన్స్
- January 12, 2023
రియాద్: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఆదుకొనేందుకు సౌదీ అరేబియా ప్రయత్నాలు మొదలు పెట్టింది.క్రౌన్ ప్రిన్స్ మరియు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ మధ్య ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్ ఫ్రేమ్వర్క్లో ఈ చర్య వచ్చింది.
పాకిస్థాన్ కు సాయం చేయడానికి, అక్కడ పెట్టుబడులను పెంచడానికి ఉన్న అవకాశాలను వెతకాలని దేశ అధికారులను క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారు.పాకిస్థాన్ బ్యాంక్లోని తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్లకు పెంచడానికి ఉన్న మార్గాలపై సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్వేషణ నిర్వహించనుంది. దీంతోపాటు పాక్లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్లకు పెంచే మార్గాలపై కూడా దృష్టిపెట్టనుంది.
ప్రస్తుతం పాక్ లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 5.6 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి.గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యల్పం.ఇవి కేవలం ఒక నెలరోజులపాటు దిగుమతులకు సరిపోతాయి. ఈ క్రమంలో డాలర్లను కాపాడుకొనేందుకు పాక్ అనేక చర్యలను చేపట్టింది.గత నెల సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల రుణాన్ని పాకిస్థాన్కు అందజేసింది. తాజాగా మరింత సాయం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఒక డాలర్కు 228 రూపాయిలుగా నడుస్తోంది.మరో వైపు సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) వద్దకు పాక్ వెళ్లింది. ఐఎంఎఫ్ విడతలవారీగా 800 కోట్ల డాలర్ల మేరకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. అయితే అందుకు బోలెడన్ని షరతులు విధిస్తోంది.ముఖ్యంగా పన్నులు పెంచాలంటోంది. వాటిని అంగీకరిస్తే ప్రజలపై భారం పడుతుంది. అసలే రాజకీయంగా, ఆర్థికంగా నలిగిపోతున్న ప్రజానీకం తిరగ బడితే సమస్యలు తీవ్రమవుతాయనే భయం నాయకుల్లో ఉంది. దీంతో ఐఎంఎఫ్ సాయం అనిశ్చితిలో పడింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







