26వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 12, 2023
కర్ణాటక: 26వ జాతీయ యువజనోత్సవాలను కర్ణాటకలోని హుబ్బిలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు మొదటిసారి కర్ణాటక రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 7500 మంది ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో నిర్వహించడం ఆనవాయితీ. కాగా గత ఏడాది పుదుచ్చేరిలో జరిగాయి.
జీ-20, వై-20 కార్యక్రమాల అనంతరం జరగుతోన్న ఈ కార్యక్రమం ఆ రెండు కార్యక్రమాల నుంచి వచ్చిన ఐదు థీమ్లపై ప్లీనరీ చర్చకు సాక్ష్యంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు వీటిలో ప్రధానమైనవి. కాగా, వాతావరణ మార్పు, విపత్తు ప్రమాద తగ్గింపు; శాంతి నిర్మాణం, సయోధ్య; ప్రజాస్వామ్యం, పాలనలో భవిష్యత్తు-యువతకు భాగస్వామ్యాలతో పాటు ఆరోగ్యం & శ్రేయస్సు వంటి అంశాలను కీలకంగా తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!