26వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 12, 2023
కర్ణాటక: 26వ జాతీయ యువజనోత్సవాలను కర్ణాటకలోని హుబ్బిలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు మొదటిసారి కర్ణాటక రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 7500 మంది ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో నిర్వహించడం ఆనవాయితీ. కాగా గత ఏడాది పుదుచ్చేరిలో జరిగాయి.
జీ-20, వై-20 కార్యక్రమాల అనంతరం జరగుతోన్న ఈ కార్యక్రమం ఆ రెండు కార్యక్రమాల నుంచి వచ్చిన ఐదు థీమ్లపై ప్లీనరీ చర్చకు సాక్ష్యంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు వీటిలో ప్రధానమైనవి. కాగా, వాతావరణ మార్పు, విపత్తు ప్రమాద తగ్గింపు; శాంతి నిర్మాణం, సయోధ్య; ప్రజాస్వామ్యం, పాలనలో భవిష్యత్తు-యువతకు భాగస్వామ్యాలతో పాటు ఆరోగ్యం & శ్రేయస్సు వంటి అంశాలను కీలకంగా తీసుకున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









