26వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 12, 2023
కర్ణాటక: 26వ జాతీయ యువజనోత్సవాలను కర్ణాటకలోని హుబ్బిలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు మొదటిసారి కర్ణాటక రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 7500 మంది ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో నిర్వహించడం ఆనవాయితీ. కాగా గత ఏడాది పుదుచ్చేరిలో జరిగాయి.
జీ-20, వై-20 కార్యక్రమాల అనంతరం జరగుతోన్న ఈ కార్యక్రమం ఆ రెండు కార్యక్రమాల నుంచి వచ్చిన ఐదు థీమ్లపై ప్లీనరీ చర్చకు సాక్ష్యంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు వీటిలో ప్రధానమైనవి. కాగా, వాతావరణ మార్పు, విపత్తు ప్రమాద తగ్గింపు; శాంతి నిర్మాణం, సయోధ్య; ప్రజాస్వామ్యం, పాలనలో భవిష్యత్తు-యువతకు భాగస్వామ్యాలతో పాటు ఆరోగ్యం & శ్రేయస్సు వంటి అంశాలను కీలకంగా తీసుకున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







