కొత్త జెబెల్ జైస్ రోడ్డు ప్రారంభం.. 75% ప్రయాణ సమయం ఆదా
- January 13, 2023
యూఏఈ: జెబెల్ జైస్కు నిర్మించిన కొత్త రహదారి ప్రారంభమైంది. ఇది దేశంలోని ఎత్తైన శిఖరానికి వెళ్లే వాహనదారుల సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రింగ్ రోడ్ నుండి కొత్త జెబెల్ జైస్ రహదారి వాడి హకీల్ ప్రాంతం గుండా వెళుతూ.. ఎమిరేట్స్ రోడ్కి కలుపుతుందని రస్ అల్ ఖైమాలోని పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ కొత్త 8.6-కిలోమీటర్ల రహదారిని దాటేందుకు కేవలం నాలుగు నిమిషాల సమయం పడుతుంది. వాడి అల్ బీహ్ పాత మార్గంతో వాడి షిహా రోడ్లోని కనెక్షన్ పాయింట్తో పోల్చినప్పుడు ప్రయాణ సమయం 75 శాతం తగ్గుతుందని డిపార్ట్మెంట్ తెలిపింది.
రస్ అల్ ఖైమా ఎత్తైన శిఖరాన్ని సందర్శించే పర్యాటకులకు, ఎమిరేట్లో పట్టణ విస్తరణ అవసరాలను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. దేశంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో జెబెల్ జైస్ ఒకటి. దీంతో కొత్త రహదారి ఉత్తర ఎమిరేట్లో పర్యాటక రంగాన్ని మరింతగా పెంచుతుందని డిపార్టుమెంట్ పేర్కొంది. రాస్ అల్ ఖైమా గత సంవత్సరం అత్యధిక వార్షిక సందర్శకుల సంఖ్య(1.13 మిలియన్లు)ను సాధించింది. 2021తో పోలిస్తే 15.6 శాతం పెరుగుదల నమోదైంది. రహదారి నిర్మాణంలో సుమారు 2.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాతిని తవ్వితీశారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







