కొత్త జెబెల్ జైస్ రోడ్డు ప్రారంభం.. 75% ప్రయాణ సమయం ఆదా
- January 13, 2023
యూఏఈ: జెబెల్ జైస్కు నిర్మించిన కొత్త రహదారి ప్రారంభమైంది. ఇది దేశంలోని ఎత్తైన శిఖరానికి వెళ్లే వాహనదారుల సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రింగ్ రోడ్ నుండి కొత్త జెబెల్ జైస్ రహదారి వాడి హకీల్ ప్రాంతం గుండా వెళుతూ.. ఎమిరేట్స్ రోడ్కి కలుపుతుందని రస్ అల్ ఖైమాలోని పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ కొత్త 8.6-కిలోమీటర్ల రహదారిని దాటేందుకు కేవలం నాలుగు నిమిషాల సమయం పడుతుంది. వాడి అల్ బీహ్ పాత మార్గంతో వాడి షిహా రోడ్లోని కనెక్షన్ పాయింట్తో పోల్చినప్పుడు ప్రయాణ సమయం 75 శాతం తగ్గుతుందని డిపార్ట్మెంట్ తెలిపింది.
రస్ అల్ ఖైమా ఎత్తైన శిఖరాన్ని సందర్శించే పర్యాటకులకు, ఎమిరేట్లో పట్టణ విస్తరణ అవసరాలను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. దేశంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో జెబెల్ జైస్ ఒకటి. దీంతో కొత్త రహదారి ఉత్తర ఎమిరేట్లో పర్యాటక రంగాన్ని మరింతగా పెంచుతుందని డిపార్టుమెంట్ పేర్కొంది. రాస్ అల్ ఖైమా గత సంవత్సరం అత్యధిక వార్షిక సందర్శకుల సంఖ్య(1.13 మిలియన్లు)ను సాధించింది. 2021తో పోలిస్తే 15.6 శాతం పెరుగుదల నమోదైంది. రహదారి నిర్మాణంలో సుమారు 2.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాతిని తవ్వితీశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







