నిబంధనలు పాటించని పాదచారులకు 400 దిర్హామ్ల జరిమానా
- January 20, 2023
యూఏఈ: హిట్ అండ్ రన్ ప్రమాదాలను నివారించడానికి వీధుల్లో పెట్రోలింగ్ను తీవ్రతరం చేస్తున్నట్లు ఫుజైరా పోలీసులు వెల్లడించారు. 'భద్రంగా రోడ్డను దాటే హక్కు నాకు ఉంది' అనే పేరుతో ట్రాఫిక్ భద్రతా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. పాదచారుల భద్రతను పరిరక్షించడం, మరణాలు, గాయాల శాతాన్ని తగ్గించడంతోపాటు, రోడ్లను సురక్షితంగా మార్చడం, సమాజంలోని అన్ని వర్గాలలో ట్రాఫిక్ అవగాహనను పెంపొందించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్, పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ సలేహ్ ముహమ్మద్ అబ్దుల్లా అల్-ధన్హానీ తెలిపారు. మార్కెట్లు, నివాస ప్రాంతాలు, పాఠశాలలకు సమీపంలోని రోడ్లు వంటి రద్దీగా ఉండే ప్రాంతాలలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితులపై శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించని పాదచారులకు Dh400 జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు. అలాగే నిర్దేశిత క్రాసింగ్లలో పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వని వాహనదారులకు Dh500 జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు విధించే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







