యూఏఈలో పెరిగిన వీసా, ఎమిరేట్స్ ఐడీ ఖర్చులు!
- January 20, 2023
యూఏఈ: యూఏఈలో పెరిగిన వీసా, ఎమిరేట్స్ ఐడీ ఖర్చులు పెరిగాయి. కొత్తగా ఎమిరేట్స్ ఐడి, వీసాల జారీకి రుసుములు పెరిగాయని ట్రావెల్, టైపింగ్ సెంటర్ ఏజెంట్లు చెబుతున్నారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP)కి చెందిన ఒక కస్టమర్ కేర్ ఏజెంట్ మాట్లాడుతూ.. వీసా, ఎమిరెట్ ఐడీ ఫీజులు Dh100 పెరిగినట్లు వెల్లడించారు. ఎమిరేట్స్ ID, విజిట్-రెసిడెన్సీ వీసాలకు ఫీజు పెంపు వర్తిస్తుందని ఓ టైపింగ్ సెంటర్ ఏజెంట్ తెలిపారు. ఎమిరేట్స్ ID ఇప్పుడు Dh270కి బదులుగా Dh370 అయిందన్నారు. ఒక నెల సందర్శన వీసా జారీ చేయడానికి రుసుము Dh270కి బదులుగా Dh370 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, దుబాయ్ నుండి జారీ చేయబడిన విజిట్ వీసాలలో ఇంకా ఎటువంటి మార్పులు లేవని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని తెలిపారు. ICP ఇటీవల దేశంలో ఎక్కువ కాలం గడిపిన వీసాలపై జరిమానాను 50 దిర్హామ్లుగా నిర్ణయించింది. దీంతో టూరిస్ట్, విజిట్ వీసా హోల్డర్లు ఎక్కువ కాలం బస చేసేవారు 100 దిర్హామ్లకు బదులుగా రోజుకు 50 దిర్హామ్లు చెల్లించాలి. అలాగే రెసిడెన్సీ వీసాపై ఎక్కువ కాలం ఉంటున్న వారు రోజుకు 25 దిర్హామ్లకు బదులుగా రెట్టింపు 50 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరం యూఏఈలో ఎంట్రీ, రెసిడెన్సీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. గోల్డెన్ వీసా స్కీమ్, కొత్త ఐదేళ్ల గ్రీన్ రెసిడెన్సీ, మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా, జాబ్ హంటింగ్ ఎంట్రీ పర్మిట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







