38 ఏళ్ల తర్వాత గల్ఫ్ కప్ ఛాంపియన్ గా ఇరాక్
- January 20, 2023
మస్కట్: బస్రా ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన 25వ అరేబియా గల్ఫ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్లో ఇరాక్ 3-2తో ఒమన్పై విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత ఇరాక్ గల్ఫ్ టైటిల్ చేజిక్కుంచుకున్నది. చివరిసారిగా 1988లో సౌదీ అరేబియాలో ఇరాక్ గల్ఫ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇరాక్ తరఫున ఇబ్రహీం బయేష్ 24వ నిమిషంలో, 116వ నిమిషంలో అమ్జాద్ అత్వాన్ పెనాల్టీని గోల్ గా మలిచాడు. మనఫ్ యూనిస్ 120వ నిమిషంలో గోల్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఒమన్ తరఫున సలాహ్ అల్ యాహాయి 90వ నిమిషంలో పెనాల్టీని గోల్ గా మలిచాడు. 119వ నిమిషంలో ఒమర్ అల్ మాలికీ గోల్ చేశాడు. అంతకుముందు స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నంలో స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం నలుగురు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డట్లు స్థానికి మీడియా తెలిపింది.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







