38 ఏళ్ల తర్వాత గల్ఫ్ కప్ ఛాంపియన్ గా ఇరాక్
- January 20, 2023
మస్కట్: బస్రా ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన 25వ అరేబియా గల్ఫ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్లో ఇరాక్ 3-2తో ఒమన్పై విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత ఇరాక్ గల్ఫ్ టైటిల్ చేజిక్కుంచుకున్నది. చివరిసారిగా 1988లో సౌదీ అరేబియాలో ఇరాక్ గల్ఫ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇరాక్ తరఫున ఇబ్రహీం బయేష్ 24వ నిమిషంలో, 116వ నిమిషంలో అమ్జాద్ అత్వాన్ పెనాల్టీని గోల్ గా మలిచాడు. మనఫ్ యూనిస్ 120వ నిమిషంలో గోల్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఒమన్ తరఫున సలాహ్ అల్ యాహాయి 90వ నిమిషంలో పెనాల్టీని గోల్ గా మలిచాడు. 119వ నిమిషంలో ఒమర్ అల్ మాలికీ గోల్ చేశాడు. అంతకుముందు స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నంలో స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం నలుగురు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డట్లు స్థానికి మీడియా తెలిపింది.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







