జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని అమలకు స్థానం..
- April 29, 2016
టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అమలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇచ్చింది. స్వతహాగా జంతువులంటే అమలకు ఎంతో ప్రాణం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరుపున జంతు సంరక్షణ కోసం కృష్టి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని భార్య అమలకు స్థానం దక్కింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అక్కినేని అమలను సభ్యురాలిగా తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా అక్కినేని అమల గత కొన్నాళ్లుగా సినిమాలుగా దూరంగా ఉంటున్నారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
ఈ చిత్రంలో నటనకు గాను ఆమె బెస్ట్ సపోర్టింగ్ రోల్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







