జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని అమలకు స్థానం..

- April 29, 2016 , by Maagulf
జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని అమలకు స్థానం..

 టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అమలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇచ్చింది. స్వతహాగా జంతువులంటే అమలకు ఎంతో ప్రాణం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరుపున జంతు సంరక్షణ కోసం కృష్టి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని భార్య అమలకు స్థానం దక్కింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అక్కినేని అమలను సభ్యురాలిగా తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా అక్కినేని అమల గత కొన్నాళ్లుగా సినిమాలుగా దూరంగా ఉంటున్నారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
ఈ చిత్రంలో నటనకు గాను ఆమె బెస్ట్ సపోర్టింగ్ రోల్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com