జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని అమలకు స్థానం..
- April 29, 2016
టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అమలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇచ్చింది. స్వతహాగా జంతువులంటే అమలకు ఎంతో ప్రాణం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరుపున జంతు సంరక్షణ కోసం కృష్టి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని భార్య అమలకు స్థానం దక్కింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అక్కినేని అమలను సభ్యురాలిగా తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా అక్కినేని అమల గత కొన్నాళ్లుగా సినిమాలుగా దూరంగా ఉంటున్నారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
ఈ చిత్రంలో నటనకు గాను ఆమె బెస్ట్ సపోర్టింగ్ రోల్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









