నారా లోకేష్ ను కలసిన ప్రముఖ ఎన్నారై, కువైట్ తెలుగు దేశం అధ్యక్షులు కుదరవలి సుధాకర రావు
- April 29, 2016
ప్రముఖ ఎన్నారై, కువైట్ తెలుగు దేశం అధ్యక్షులు కుదరవలి సుధాకర రావు శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి శ్రీ నారా లోకేష్ ను కలిసి ఆయనను మే 20వ తారీఖున కువైట్ లో జరుప బోయే మిని మహానాడు కు ఆహ్వానించారు. కువైట్ లో సుమారు 2 లక్షల మంది తెలుగు వారున్నారని, వారిలో ఎక్కువమంది తెలుగు దేశం పార్టీ అభిమానులేనని, వారందరు లోకేష్ బాబు గారి రాకకై ఎదురు చూస్తున్నారని వివరించారు. సుధాకర రావు అభ్యర్దన మేరకు త్వరలోనే ఎన్నారై మంత్రి రఘునాధ రెడ్డి మరియు ఏ.పి.ఎన్నార్టి చీఫ్ వేమురి రవి కుమార్ గారితో కలసి కువైట్ పర్యటనకు వస్తానని లోకేష్ బాబు వివరించారు. తెలుగుదేశం కువైట్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను సుధాకర రావు లోకేష బాబు కు వివరించారు.
ఆ తరువాత జరిగిన కార్యక్రమములో సుధాకర రావు లోకేష్ బాబు చేతులమీధుగా ఎన్టిఆర్ ట్రస్ట్ కు అంబులెన్స్ ను బహూకరించారు. పూజా కార్యక్రమాలనంతరము జండా వూపి అంబులన్స్ ను ప్రారంభించారు. తరువాత విలేకరుల సమావేశములో ఎన్టిఆర్ ట్రస్ట్ సి.ఈ.వో. విష్ణు వర్ధన్ మాట్లాడుతూ అంబులన్స్ ను బహూకరించినందుకు అభినందిస్తూ సుధాకర రావు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత సుధాకర రావు మాట్లాదుతూ విదేశాలలో దురదృష్ట వశాత్తు అనారోగ్యం పాలై లేక మరణించిన వారిని చెన్నై, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం విమానాశ్రయాలనుండి వారి ఇండ్లకు చేరవేయటానికి ఉపయోగ పడాలనే ఉద్దేశ్యముతో ఈ అంబులన్స్ ను ఎన్టిఆర్ ట్రస్ట్ కు ఇచ్చినట్లు తెలియ చేసారు. ఎన్టీఅర్ ట్రస్ట్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను సుధాకర రావు కొనియాడారు. గల్ఫ్ దేశాలలో ఎంటీఅర్ ట్రస్ట్ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తానని మరియు ముందు ముందు సేవా కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటానని తెలియ చేసారు. గుంటురు జిల్లా బొబ్బర్లంక గ్రామమునకు చెందిన కుదరవల్లి సుధాకర రావు గత పది హేను సంవత్సరాలుగా కువైట్ లో ఉంటున్నట్లూ వివరించారు. ఏ కార్యక్రమములో ఏ.పి.ఎన్నర్టీ చీఫ్ రవి వేమురి గారు, బుచ్చిరాం గారు, నిరంజన్ గారు, మురళి గారు, శరత్ గారు, వెంకట అప్పా రావు గారు, నాగెంద్ర బాబు గారు, కాపెర్ల పట్టభి రాము గారు, ఎన్టిఆర్ ట్రస్త్ సిబ్బంది పాల్గొన్నరు.







తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







