ఎన్నికల టెంటుకు నిప్పు.. నలుగురికి మూడేళ్ల జైలు శిక్ష, BD 3,000 జరిమానా

- January 21, 2023 , by Maagulf
ఎన్నికల టెంటుకు నిప్పు.. నలుగురికి మూడేళ్ల జైలు శిక్ష, BD 3,000 జరిమానా

బహ్రెయిన్: 2022 పార్లమెంటరీ, మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచార టెంటును తగలబెట్టిన కేసులో నలుగురికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. నష్టపరిహారంగా సామూహికంగా BD3,000 జరిమానా చెల్లించాలని బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. 12 నవంబర్ 2022న బహ్రెయిన్‌లో కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మునిసిపల్ కౌన్సిల్ మెంబర్‌లను ఎన్నుకోవడం కోసం బహ్రెయిన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన రోజున నిందితులు ముఠాగా ఏర్పడి అభ్యర్థికి చెందిన టెంట్‌ను తగలబెట్టాలని సామూహికంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. ఘటన తర్వాత నిందితులు పారిపోయే క్రమంలో సెక్యురిటీ గార్డులకు దొరికిపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com