ఎన్నికల టెంటుకు నిప్పు.. నలుగురికి మూడేళ్ల జైలు శిక్ష, BD 3,000 జరిమానా
- January 21, 2023
బహ్రెయిన్: 2022 పార్లమెంటరీ, మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచార టెంటును తగలబెట్టిన కేసులో నలుగురికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. నష్టపరిహారంగా సామూహికంగా BD3,000 జరిమానా చెల్లించాలని బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. 12 నవంబర్ 2022న బహ్రెయిన్లో కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మునిసిపల్ కౌన్సిల్ మెంబర్లను ఎన్నుకోవడం కోసం బహ్రెయిన్లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన రోజున నిందితులు ముఠాగా ఏర్పడి అభ్యర్థికి చెందిన టెంట్ను తగలబెట్టాలని సామూహికంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. ఘటన తర్వాత నిందితులు పారిపోయే క్రమంలో సెక్యురిటీ గార్డులకు దొరికిపోయారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







