వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- January 24, 2023సింగపూర్: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల వేడుకను ఈసారి కూడా ఇక్కడి పొంగోల్ పార్క్ లో ఎప్పటివలె ఘనంగా నిర్వహించటం జరిగింది.మన తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టి పడేలా, పిల్లలకు భోగి పళ్ళ దీవెనలతో ప్రారంభమైన ఈ వేడుకలు, గొబ్బెమ్మలు, మహిళామణుల రంగు రంగుల రంగవల్లికల పోటీలు, పిల్లల పతంగుల తయారీ వంటి కార్యక్రమాలతో మరింత ఉత్సాహాన్ని తీసుకు వచ్చాయి.చిన్నారులు మన సంప్రదాయ దుస్తులలో పోటీ పడటమే గాక, తమ శ్రావ్యమైన గొంతులతో అనేక శ్లోకాలు, పాటలతో మురిపించారు.కార్యక్రమంలో ప్రత్యేకమైన సంక్రాతి థీమ్ కి సంబందించిన తెర ఏర్పాటులో సౌజి డేకర్స్ అనే సంస్థ సభ్యులు సహకరించడం జరిగింది. ఫణీష్ ఆత్మురి సంక్రాంతి శోభ అనే ప్రసంగం ఆహుతులని ఆకట్టుకొంది.
పసందైన మన సాంప్రదాయిక విందు భోజనంతో పాటు, రోజంతా సాగిన ఈ వేడుకలలో పిల్లలు, పెద్దలూ, దంపతులూ అనేక విన్నూత్నమైన ఆట పాటలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఆద్యంతమూ ఉల్లాసంగా గడిపారు.సుమారు 190 మంది పెద్దలు, 50 మంది పిల్లలు పాల్గొని విజయవంతం చేసిన ఈ సంబరాలు, వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ దశమ వార్షికోత్సవంలోనికి అడుగిడుతున్న శుభ తరుణంలో జరగడం విశేషం.
సింగపూర్ లోని ఆర్యవైశ్యులు తమ దైనందిన ఒత్తిడులను పక్కన బెట్టి, మన సంస్కృతిని ప్రతిబింబించేలా, అత్యంత సంఘీభావంతో ఈ వేడుకలలో పాల్గొనడం శ్లాఘనీయమని, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ గోట్ల పేర్కొన్నారు. క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి గారు వర్చువల్ గా మాట్లాడుతూ సింగపూర్ నందలి వైశ్యులు నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో గొప్పగా నిర్వహించారని, వైశ్యులు ఎప్పుడు ఇలానే ధర్మసంబంధమైన మరియు మన సాంప్రదాయ సంబంధమైన విషయాల్లో ముందుంటు సమిష్టిగా మరియు ఇలా విజయవంతంగా మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని మరియు నేటి ఈ కార్యక్రమానికి తోడ్పడిన తోటి కార్య నిర్వాహక బృంద సభ్యులకు, సేవా దళానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన సీనియర్ సభ్యుడు ముక్కా కిశోర్ తెలియ చేశారు, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అందరు చిన్నపిల్లలవలె ఆటపాటల్లో మునిగితేలారరని కార్యక్రమ నిర్వాహక కర్త రాయల సుమన్ మరియు దివ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన జానపద కోకిల, వైశ్య రత్నం అయిన డాక్టర్ అరుణ సుబ్బారావు ప్రత్యేక ప్రదర్శనలతో, పాటలతో ఆద్యంతం అందరిని ఆనందంలో ముంచెత్తారు.
ఈ కార్యక్రమం విజయవంతమవ్వడంలో సంస్థ సభ్యులైన సరిత, రాజా విశ్వనాథుల, రాఘవ, ఆనంద్, కిశోర్, శ్రీధర్ మంచికంటి మరియు వాసవి సేవ సభ్యులైన శివ కిషన్, మార్తాండ్, చైతన్య, అవినాష్, చలం, గోపి కిషోర్, ప్రసాద్ బచ్చు, యదా నరేష్, పురుషోత్తం, సందీప్, సతీష్ వుద్దగిరి, సంతోష్ మాదారపు, మనోహర్, సత్య, దివ్య గాజులపల్లి తదితరులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం