సీనియర్ నటి జమున కన్నుమూత..
- January 27, 2023
హైదరాబాద్: టాలీవుడ్ లో గత కొంతకాలం నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2022లో కృష్ణ, కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. లాంటి స్టార్లు, మరికొంతమంది సినీ ప్రముఖులు వరుసగా మరణించి టాలీవుడ్ సినీ పరిశ్రమని శోకసంద్రంలో ముంచేశారు. 2023 లో కూడా ఈ విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మరణించగా తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. లాంటి అప్పటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జమున నేడు ఉదయం కన్నుమూశారు.
ప్రస్తుతం తన పిల్లలతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు జమున. గత కొన్నాళ్లుగా వయోభారం సమస్యలతో బాధపడుతున్న జమున 86 ఏళ్ళ వయసులో నేడు శుక్రవారం ఉదయం 7 గంటలకు తన స్వగృహంలో మరణించారు. ఆమె వారసులు ఈ విషయాన్ని మీడియాకి తెలియచేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించి తన అందంతో, అభినయంతో మెప్పించారు. రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళు కొనసాగారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో సినిమాలకి దూరంగా ఉంటున్నా అప్పుడప్పుడు సినీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పరిశ్రమకి దగ్గరగానే ఉంటున్నారు జమున.
నేడు ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు అభిమానులు, ప్రముఖులు సందర్శనార్థం తరలించనున్నారు. జమున మరణంతో టాలీవుడ్ మరోసారి విషాదంలోకి వెళ్ళింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







