శంకర్ సునీల్ ల కాంబినేషన్ లో కొత్త చిత్రం.!

- April 30, 2016 , by Maagulf
శంకర్ సునీల్ ల కాంబినేషన్ లో కొత్త చిత్రం.!

వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.శంకర్ 'జై బోలో తెలంగాణ' చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల నూతన తారలతో దర్శకునిగా తన తొమ్మిదో చిత్రాన్ని ప్రారంభించిన ఎన్.శంకర్ ఇప్పుడు సునీల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారిగా తన బ్యానర్‌లో వేరే దర్శకునికి అవకాశం ఇచ్చారు. 'దూకుడు', 'బాద్‌షా', 'ఆగడు' చిత్రాలకు స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com