రామ్ పోతినేని.! 100 మంది కాదు షేర్ఖాన్.. 300 మంది.!
- January 28, 2023
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్లాన్ మామూలుగా లేదండోయ్. ఎలాగైనా ఈ సారి గట్టి హిట్ కొట్టాలన్న కసితో వున్నాడీ యంగ్ హీరో. అందులో భాగంగానే మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శీనుతో చేతులు కలిపాడు. ఇటీవలే ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన రామ్కి ఆశించిన సక్సెస్ అందలేదు.
దాంతో, మరింత కసి పెంచాడు. బోయపాటితో చేయబోయే సినిమా అలా ఇలా వుండదంట. మాస్ యాక్షన్కి పెట్టింది పేరైన బోయపాటి, రామ్తో చేయబోయే యాక్షన్ ప్యాన్ ఇండియా రేంజ్లో వుండబోతోంది. ‘మగధీర’లో 100 మందితో తీసిన ఫైట్ సంచలనం కాగా, ఇప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడే ఏకంగా 300 మందితో రామ్ పోతినేని మీద తెరకెక్కించబోతున్నాడట బోయపాటి.
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లో రూపొందబోతోంది ఈ సినిమా. రామ్ కెరీర్లో మరో ఇస్మార్ట్ శంకర్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







