రామ్ పోతినేని.! 100 మంది కాదు షేర్ఖాన్.. 300 మంది.!
- January 28, 2023యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్లాన్ మామూలుగా లేదండోయ్. ఎలాగైనా ఈ సారి గట్టి హిట్ కొట్టాలన్న కసితో వున్నాడీ యంగ్ హీరో. అందులో భాగంగానే మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శీనుతో చేతులు కలిపాడు. ఇటీవలే ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన రామ్కి ఆశించిన సక్సెస్ అందలేదు.
దాంతో, మరింత కసి పెంచాడు. బోయపాటితో చేయబోయే సినిమా అలా ఇలా వుండదంట. మాస్ యాక్షన్కి పెట్టింది పేరైన బోయపాటి, రామ్తో చేయబోయే యాక్షన్ ప్యాన్ ఇండియా రేంజ్లో వుండబోతోంది. ‘మగధీర’లో 100 మందితో తీసిన ఫైట్ సంచలనం కాగా, ఇప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడే ఏకంగా 300 మందితో రామ్ పోతినేని మీద తెరకెక్కించబోతున్నాడట బోయపాటి.
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లో రూపొందబోతోంది ఈ సినిమా. రామ్ కెరీర్లో మరో ఇస్మార్ట్ శంకర్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..