మసీదులో ఆత్మాహుతి దాడి.. 28 మంది మృతి
- January 30, 2023
పాకిస్తాన్: పాక్ లో భారీ పేలుడు జరిగింది. మసీదులో బాంబు పేలడంతో 28 మంది చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు. పెషావర్ సిటీలోని స్థానిక పోలీసు కార్యాలయంలో ఉన్న మసీదులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనలు చేసేందుకు 260 మంది వరకు రాగా..ప్రార్థనలు చేస్తున్న టైములో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబ్డాయి. ఈ దాడిలో దాదాపు 28 మంది వరకు మరణించినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వీరిలో ఎక్కువ మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా జనం ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లింది. పేలుడు తర్వాత మసీదు భవనంలోని కొంత భాగం దెబ్బతిని శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు పోలీస్ అధికారి సికిందర్ ఖాన్ తెలిపారు. పేలుడు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెషావర్లోని సమీప ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. గతేడాది మార్చిలో పెషావర్ లోనే షియాలకు చెందిన మసీదుపై ఐసిస్ ఆత్మాహుతి చేయగా.. 64 మందికి పైగా చనిపోయారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









