మసీదులో ఆత్మాహుతి దాడి.. 28 మంది మృతి

- January 30, 2023 , by Maagulf
మసీదులో ఆత్మాహుతి దాడి.. 28 మంది మృతి

పాకిస్తాన్: పాక్ లో భారీ పేలుడు జరిగింది. మసీదులో బాంబు పేలడంతో 28 మంది చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు. పెషావర్ సిటీలోని స్థానిక పోలీసు కార్యాలయంలో ఉన్న మసీదులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనలు చేసేందుకు 260 మంది వరకు రాగా..ప్రార్థనలు చేస్తున్న టైములో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబ్డాయి. ఈ దాడిలో దాదాపు 28 మంది వరకు మరణించినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వీరిలో ఎక్కువ మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా జనం ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లింది. పేలుడు తర్వాత మసీదు భవనంలోని కొంత భాగం దెబ్బతిని శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు పోలీస్ అధికారి సికిందర్ ఖాన్ తెలిపారు. పేలుడు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెషావర్‌లోని సమీప ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. గతేడాది మార్చిలో పెషావర్ లోనే షియాలకు చెందిన మసీదుపై ఐసిస్ ఆత్మాహుతి చేయగా.. 64 మందికి పైగా చనిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com