కువైట్లో ఐటీఎఫ్ టోర్నమెంట్: విజేతగా భారత ఆటగాడు ప్రజ్నేష్
- January 31, 2023
కువైట్: ఆదివారం కువైట్లో జరిగిన ఐటీఎఫ్ కువైట్ పురుషుల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేష్ గుణేశ్వరన్(33) విజేతగా నిలిచాడు. 360 మాల్లోని షేక్ జాబర్ అల్-అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబా ఇంటర్నేషనల్ టెన్నిస్ కాంప్లెక్స్లో జరిగిన $25,000 ITF పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో ప్రజ్నేష్ 6-2, 7-6(5)తో ఉజ్బెకిస్తాన్కు చెందిన ఖుమోయున్ సుల్తానోవ్ను ఓడించాడు. 19 దేశాలకు చెందిన 41 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్ కువైట్, అరబ్ టెన్నిస్ ఫెడరేషన్ల అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబా పర్యవేక్షణలో జరిగింది. ఫైనల్ మ్యాచ్కు కువైట్ టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఫలేహ్ అల్-ఒతైబీ హాజరయ్యారు. 2019లో కెరీర్లో అత్యధికంగా 75వ స్థానంలో నిలిచిన ప్రజ్నేష్కు ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఇది 11వ టైటిల్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







