కువైట్లో ఐటీఎఫ్ టోర్నమెంట్: విజేతగా భారత ఆటగాడు ప్రజ్నేష్
- January 31, 2023
కువైట్: ఆదివారం కువైట్లో జరిగిన ఐటీఎఫ్ కువైట్ పురుషుల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేష్ గుణేశ్వరన్(33) విజేతగా నిలిచాడు. 360 మాల్లోని షేక్ జాబర్ అల్-అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబా ఇంటర్నేషనల్ టెన్నిస్ కాంప్లెక్స్లో జరిగిన $25,000 ITF పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో ప్రజ్నేష్ 6-2, 7-6(5)తో ఉజ్బెకిస్తాన్కు చెందిన ఖుమోయున్ సుల్తానోవ్ను ఓడించాడు. 19 దేశాలకు చెందిన 41 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్ కువైట్, అరబ్ టెన్నిస్ ఫెడరేషన్ల అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబా పర్యవేక్షణలో జరిగింది. ఫైనల్ మ్యాచ్కు కువైట్ టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఫలేహ్ అల్-ఒతైబీ హాజరయ్యారు. 2019లో కెరీర్లో అత్యధికంగా 75వ స్థానంలో నిలిచిన ప్రజ్నేష్కు ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఇది 11వ టైటిల్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









