దుబాయ్లో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినం
- January 31, 2023
దుబాయ్: దుబాయ్లో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినం అయ్యాయి . చట్టాలను ఉల్లంఘించే వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు అథారిటీని అనుమతించే ఎమిరేట్స్ పార్కింగ్ ఒప్పందంపై సంతకం చేసినట్లు దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) సోమవారం తెలిపింది. కొత్తగా సంతకం చేసిన ఒప్పందం ప్రకారం ఫెడరల్, స్థానిక నియమాలు-నిబంధనలకు కట్టుబడి లేని తేలికపాటి, భారీ వాహనాలు, ట్రైలర్లను RTA స్వాధీనం చేసుకోవచ్చు. దీనితో పాటు భవిష్యత్తులో ప్రయాణీకుల రవాణా కార్యకలాపాల పర్యవేక్షణ విభాగం, రైట్-ఆఫ్-వే విభాగం, రైల్ రైట్-ఆఫ్-వే విభాగం, లైసెన్సింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ విభాగం, పార్కింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఏదైనా ఇతర RTA విభాగం వాహనాల జప్తుకు సంబంధించిన బాధ్యతలను చేపట్టనున్నారు. అథారిటీ నవంబర్ 2022లో ఎమిరేట్లో పబ్లిక్ పార్కింగ్ మెషీన్ల ఆటోమేషన్, పునరుద్ధరణను పూర్తి చేసింది. టెక్నికల్ ట్రాఫిక్ ఉల్లంఘన ఫలితంగా సీజ్ చేసిన వాహనాన్ని చలానా చెల్లించిన తర్వాత నిర్ణీత వ్యవధి తర్వాత విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









