జీతాలు చెల్లించని కంపెనీపై కార్మిక శాఖ చర్యలు
- February 04, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని అల్ దహిరా గవర్నరేట్లో గత కొద్ది నెలలుగా తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందుకు ఒక ప్రైవేట్ రంగ సంస్థపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అల్దాహిరా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, అనేక నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంపై కార్మిక చట్టం ఆర్టికల్ నంబర్ 53, 51 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ప్రైవేట్ రంగ కంపెనీపై చర్యలు తీసుకోవాలని న్యాయ అధికారులకు రిఫర్ చేసినట్లు ప్రకటించింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ నెం. (51)లో పేర్కొన్న తేదీలలోపు తమ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు, కంపెనీలకు పిలుపునిచ్చింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ No51 కింద నెలవారీ వేతనాలపై నియమించబడిన కార్మికులకు వారి వేతనాలను కనీసం ప్రతి నెలా ఒకసారి చెల్లించాలి.
తాజా వార్తలు
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!







