విశాఖ- తిరుపతి డబుల్డెక్కర్ రైలు...
- May 01, 2016
కాచిగూడ-గుంటూరు మాదిరిగా మరోటిఈ నెలాఖరులోగా ప్రారంభించే అవకాశాలు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొత్తకొత్త రైళ్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ-హైదరాబాద్, విశాఖ-తిరుపతి మధ్య విజయవాడ మీదుగా డబుల్డెక్కర్ రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే సర్వేలను పూర్తి చేసి నివేదికలను కేంద్ర రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పంపించారు. రైల్వే బోర్డు నుంచి అనుమతి రావడమే ఆలస్యమన్నట్టుగా డబుల్డెక్కర్ రైళ్లకు అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరున పట్టాలెక్కనుంది. ఈ డబుల్డెక్కర్లో ఉండే 18 బోగీలన్నీ ఏసీవే కావడం విశేషం. చైర్కార్ కావడంతో ఈ రైలును విశాఖపట్నంలో ఉదయం బయల్దేరేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ విశాఖ-తిరుపతి మార్గంలో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉంటే విశాఖ-హైదరాబాద్ మధ్య నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య డబుల్డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి.వీటిలో ఒక రైలునుగానీ, మరో కొత్త రైలును గానీ విశాఖ-తిరుపతి మధ్య నడిపే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. విశాఖపట్టణంలో మధ్యాహ్నం బయల్దేరి రాత్రికి విజయవాడ చేరుకుని, తెల్లవారుజామున తిరుపతి చేరితే ప్రయాణికుల నుంచి ఆదరణ లభించే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







