టిక్ టాక్ కీలక నిర్ణయం..
- February 11, 2023
భారత్: సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ లో మొత్తం సిబ్బందిని తొలగించింది. జాతీయ భద్రత కారణాలతో 2020లో భారత్ లో నిషేధించబడిన టిక్ టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. భారత్ లో టిక్ టాక్ కు అత్యధిక యూజర్లు ఉన్నారు. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తోన్న ఉద్యోగులందరిని టిక్ టాక్ తొలగిస్తుూ నిర్ణయం తీసుకుంది.
భారత్ లో టిక్ టాక్ నిషేధానికి గురైన మూడేళ్ల తర్వాత బైట్ డ్యాన్స్ కు చెందిన సోషల్ మీడియా యాప్ భారత్ లో పని చేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్ టాక్ ఇప్పటికీ భారత్ లో తన కార్యాలయాన్ని కొనసాగించడం గమనార్హం. భారత కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కెట్ల కోసం పని చేస్తున్నారు.
ఇక భారత్ లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించేందుకు టిక్ టాక్ ప్రయత్నాలు ఫలించ లేదు. అమెరికాలోనూ యాప్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్ కు సపోర్టు కోసం 2020లో భారత్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్టు హబ్ ను మూసివేయాలని నిర్ణయించామని టిక్ టాక్ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







