టిక్ టాక్ కీలక నిర్ణయం..
- February 11, 2023
భారత్: సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ లో మొత్తం సిబ్బందిని తొలగించింది. జాతీయ భద్రత కారణాలతో 2020లో భారత్ లో నిషేధించబడిన టిక్ టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. భారత్ లో టిక్ టాక్ కు అత్యధిక యూజర్లు ఉన్నారు. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తోన్న ఉద్యోగులందరిని టిక్ టాక్ తొలగిస్తుూ నిర్ణయం తీసుకుంది.
భారత్ లో టిక్ టాక్ నిషేధానికి గురైన మూడేళ్ల తర్వాత బైట్ డ్యాన్స్ కు చెందిన సోషల్ మీడియా యాప్ భారత్ లో పని చేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్ టాక్ ఇప్పటికీ భారత్ లో తన కార్యాలయాన్ని కొనసాగించడం గమనార్హం. భారత కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కెట్ల కోసం పని చేస్తున్నారు.
ఇక భారత్ లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించేందుకు టిక్ టాక్ ప్రయత్నాలు ఫలించ లేదు. అమెరికాలోనూ యాప్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్ కు సపోర్టు కోసం 2020లో భారత్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్టు హబ్ ను మూసివేయాలని నిర్ణయించామని టిక్ టాక్ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









