టిక్ టాక్ కీలక నిర్ణయం..
- February 11, 2023
భారత్: సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ లో మొత్తం సిబ్బందిని తొలగించింది. జాతీయ భద్రత కారణాలతో 2020లో భారత్ లో నిషేధించబడిన టిక్ టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. భారత్ లో టిక్ టాక్ కు అత్యధిక యూజర్లు ఉన్నారు. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తోన్న ఉద్యోగులందరిని టిక్ టాక్ తొలగిస్తుూ నిర్ణయం తీసుకుంది.
భారత్ లో టిక్ టాక్ నిషేధానికి గురైన మూడేళ్ల తర్వాత బైట్ డ్యాన్స్ కు చెందిన సోషల్ మీడియా యాప్ భారత్ లో పని చేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్ టాక్ ఇప్పటికీ భారత్ లో తన కార్యాలయాన్ని కొనసాగించడం గమనార్హం. భారత కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కెట్ల కోసం పని చేస్తున్నారు.
ఇక భారత్ లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించేందుకు టిక్ టాక్ ప్రయత్నాలు ఫలించ లేదు. అమెరికాలోనూ యాప్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్ కు సపోర్టు కోసం 2020లో భారత్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్టు హబ్ ను మూసివేయాలని నిర్ణయించామని టిక్ టాక్ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







