బహ్రెయిన్లో ఫిబ్రవరి 20న 'విజువల్ ట్రాన్స్లేషన్స్' ఎక్స్పో
- February 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజ్యంలో "విజువల్ ట్రాన్స్లేషన్స్" ఆర్ట్ ఎగ్జిబిషన్కు వేదిక సిద్ధమైంది. ఈ ఈవెంట్ను బహ్రెయిన్ ఆర్ట్ హబ్ (BAH)తో కలిసి ది డైలీ ట్రిబ్యూన్, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహిస్తున్నాయి. భారత రాయబారి హెచ్.ఇ. పీయూష్ శ్రీవాస్తవ ఫిబ్రవరి 20న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మానవ, ఆర్థిక వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి నయీఫ్ అల్ షెరూఖీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫిబ్రవరి 20 నుండి 28 వరకు ఉమ్ అల్ హసమ్లోని మెకిండీజ్ టవర్లోని డైలీ ట్రిబ్యూన్ కార్యాలయంలో కళాకారులు రూపొందించిన పెయింటింగ్లు ప్రదర్శించబడతాయి. ఇందులో పాల్గొంటున్న బహ్రెయిన్ ఆర్ట్ హబ్ లో భారతీయ కళాకారులైన ఆటమ్జీత్ సింగ్ బావా, నిజూ జాయ్, సాగర్ అద్కర్, సైరా రంజ్, సుదీప్ దేశ్పాండే, తేజ్బీర్ సింగ్, బహ్రెయిన్ కళాకారుడు మొహమ్మద్ తాహా ఉన్నారు. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ( IFAS)ని 1974లో స్థాపించారు. కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సరిహద్దులకు అతీతంగా ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని లక్ష్యం. ఇండో-బహ్రెయిన్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడంలో IFAS అగ్రగామిగా ఉంది. ప్రపంచ స్థాయి భారతీయ కళాకారులను బహ్రెయిన్ తీసుకురావడంలో ఈ గ్రూపుది కీలక పాత్ర.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







