బహ్రెయిన్లో ఫిబ్రవరి 20న 'విజువల్ ట్రాన్స్లేషన్స్' ఎక్స్పో
- February 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజ్యంలో "విజువల్ ట్రాన్స్లేషన్స్" ఆర్ట్ ఎగ్జిబిషన్కు వేదిక సిద్ధమైంది. ఈ ఈవెంట్ను బహ్రెయిన్ ఆర్ట్ హబ్ (BAH)తో కలిసి ది డైలీ ట్రిబ్యూన్, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహిస్తున్నాయి. భారత రాయబారి హెచ్.ఇ. పీయూష్ శ్రీవాస్తవ ఫిబ్రవరి 20న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మానవ, ఆర్థిక వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి నయీఫ్ అల్ షెరూఖీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫిబ్రవరి 20 నుండి 28 వరకు ఉమ్ అల్ హసమ్లోని మెకిండీజ్ టవర్లోని డైలీ ట్రిబ్యూన్ కార్యాలయంలో కళాకారులు రూపొందించిన పెయింటింగ్లు ప్రదర్శించబడతాయి. ఇందులో పాల్గొంటున్న బహ్రెయిన్ ఆర్ట్ హబ్ లో భారతీయ కళాకారులైన ఆటమ్జీత్ సింగ్ బావా, నిజూ జాయ్, సాగర్ అద్కర్, సైరా రంజ్, సుదీప్ దేశ్పాండే, తేజ్బీర్ సింగ్, బహ్రెయిన్ కళాకారుడు మొహమ్మద్ తాహా ఉన్నారు. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ( IFAS)ని 1974లో స్థాపించారు. కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సరిహద్దులకు అతీతంగా ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని లక్ష్యం. ఇండో-బహ్రెయిన్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడంలో IFAS అగ్రగామిగా ఉంది. ప్రపంచ స్థాయి భారతీయ కళాకారులను బహ్రెయిన్ తీసుకురావడంలో ఈ గ్రూపుది కీలక పాత్ర.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







