బహ్రెయిన్లో ఫిబ్రవరి 20న 'విజువల్ ట్రాన్స్లేషన్స్' ఎక్స్పో
- February 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజ్యంలో "విజువల్ ట్రాన్స్లేషన్స్" ఆర్ట్ ఎగ్జిబిషన్కు వేదిక సిద్ధమైంది. ఈ ఈవెంట్ను బహ్రెయిన్ ఆర్ట్ హబ్ (BAH)తో కలిసి ది డైలీ ట్రిబ్యూన్, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహిస్తున్నాయి. భారత రాయబారి హెచ్.ఇ. పీయూష్ శ్రీవాస్తవ ఫిబ్రవరి 20న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మానవ, ఆర్థిక వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి నయీఫ్ అల్ షెరూఖీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫిబ్రవరి 20 నుండి 28 వరకు ఉమ్ అల్ హసమ్లోని మెకిండీజ్ టవర్లోని డైలీ ట్రిబ్యూన్ కార్యాలయంలో కళాకారులు రూపొందించిన పెయింటింగ్లు ప్రదర్శించబడతాయి. ఇందులో పాల్గొంటున్న బహ్రెయిన్ ఆర్ట్ హబ్ లో భారతీయ కళాకారులైన ఆటమ్జీత్ సింగ్ బావా, నిజూ జాయ్, సాగర్ అద్కర్, సైరా రంజ్, సుదీప్ దేశ్పాండే, తేజ్బీర్ సింగ్, బహ్రెయిన్ కళాకారుడు మొహమ్మద్ తాహా ఉన్నారు. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ( IFAS)ని 1974లో స్థాపించారు. కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సరిహద్దులకు అతీతంగా ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని లక్ష్యం. ఇండో-బహ్రెయిన్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడంలో IFAS అగ్రగామిగా ఉంది. ప్రపంచ స్థాయి భారతీయ కళాకారులను బహ్రెయిన్ తీసుకురావడంలో ఈ గ్రూపుది కీలక పాత్ర.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









