ఐఫోన్ ఆర్డర్ చేసి.. డబ్బులులేక డెలివరీ బాయ్ హత్య
- February 20, 2023బెంగళూరు; కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.యాపిల్ ఐ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేశాడు 20 ఏళ్ల వ్యక్తి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు.ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ఐఫోన్ ను తీసుకువచ్చాడు. డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన యువకుడు.. తన దగ్గర చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు.ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ని హత్య చేశాడు. అతడి మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు తన ఇంట్లోనే రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపానికి తీసుకెళ్లి దహనం చేశాడు.
అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11న కాలిన శరీరం వెలుగు చూడడంతో దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మరణించిన వ్యక్తిని హేమంత్ నాయక్ (23)గా గుర్తించారు. ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగిగా దర్యాప్తులో వెల్లడైంది.లక్ష్మీపుర లే అవుట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ను బుక్ చేసుకోగా, దాన్ని డెలివరీ చేసేందుకు ఈ నెల 7న హేమంత్ నాయక్ వెళ్లాడు. రూ.46,000 చెల్లించాలని నాయక్ కోరడంతో… దత్తా కత్తితో దాడి చేసి హతమార్చాడు.మృతదేహాన్ని ప్యాక్ చేసి బండిపై పెట్టుకుని, రైల్వే స్టేషన్ సమీపంలో దహనం చేసినట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ రికార్డుల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!