రాత్రి పూట ఈ పండ్లు తింటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!
- February 20, 2023
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ్. పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడంతో పాటూ, సి విటమిన్ తదితర ఇతరత్రా విటమిన్లు అధికంగా వుంటాయ్. అందుకే డాక్టర్లు సైతం రోజూ ఒక పండు తినమని సూచిస్తుంటారు.
అయితే, కొన్ని రకాల పండ్లు కొన్ని వేళల్లో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
అరటి పండును రెగ్యులర్గా తీసుకున్నా ఎలాంటి ప్రమాదమూ లేదు. అలాగే యాపిల్, దానిమ్మ తదితర పండ్లను ఏ టైమ్లో తీసుకున్నా సమస్య లేదు.
కానీ, ద్రాక్ష, పైనాపిల్ (అనాస) పండ్లను రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. ద్రాక్ష, పైనాపిల్ పండ్లకు త్వరగా జీర్ణమయ్యే శక్తి చాలా తక్కువ. అందుకే, వాటిని రాత్రి పూట తీసుకుంటే, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయట. అలాగే, గ్యాస్ ఫామ్ అవ్వడం వంటి అననుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెబుతున్నారు. అందుకే రాత్రి పూట వీలైనంత వరకూ ఈ పండ్లకు దూరంగా వుంటే మంచిది.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







