చైనా సరిహద్దుల వద్దకు మోదీ సైనికులను పంపారు: కేంద్ర మంత్రి జైశంకర్
- February 21, 2023
న్యూ ఢిల్లీ: సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంటే ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్దకు సైన్యాన్ని పంపింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాదని, ప్రధాని మోదీ పంపారని అన్నారు.
అక్కడ చైనా సైన్యాన్ని మోహరిస్తుండడంతో పంపారని జైశంకర్ చెప్పారు. సరిహద్దుల వద్ద 1962లో ఏమైందనే విషయంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిజాయితీగా వ్యవహరించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల కోసం మోదీ ప్రభుత్వం బడ్జెట్ ను 5 రెట్లు పెంచిందని ఆయన చెప్పారు.
ప్యాంగోంగ్ సరస్సు వద్ద గత ఏడాది చైనా బిడ్జి నిర్మాణ ప్రయత్నాలు చేయడంతో దానిపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై జైశంకర్ స్పందిస్తూ… 1962 యుద్ధం నుంచి చైనా అక్రమ అధీనంలోనే ఆ ప్రాంతం ఉందని చెప్పారు. మొదటి సారి చైనా సైన్యం 1958లో అక్కడకు వచ్చిందని, 1962లో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిందని తెలిపారు. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో చైనా బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తోందని అన్నారు. కాగా, చైనా అంశాన్ని విపక్ష పార్టీలు పార్లమెంటులోనూ లేవనెత్తుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు









