సంక్రాంతి బొమ్మలకి ఓటీటీ రెస్సాన్స్ ఎలా వుండబోతోందో.!
- February 21, 2023
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో ‘వీర సింహారెడ్డి’ ముందుగా వచ్చింది. మంచి ఓపెనింగ్స్ కొట్టేసింది. తర్వాత వచ్చిన వారసుడు రివర్స్ గేర్ వేసింది. ఇక ముచ్చటగా మూడో స్థానంలో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ గట్టిగా కొట్టాడు.
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫుల్ గ్రేస్ చూపించాడు. మాస్ రాజా రవితేజ కాంబినేషన్తో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అసలు సిసలు సంక్రాంతి సినిమాగా నిలిచింది.
ఇక ఇప్పుడు ఓటీటీ టైమొచ్చింది. ఓటీటీలో మొదటగా ‘వారసుడు’ రాబోతున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి ఈ సినిమా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. ఆ తర్వాతి రోజు నుంచి అనగా ఫిబ్రవరి 23న బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమా డిస్నీ హాట్ స్టార్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. సివరాఖరిగా ‘వీరయ్య’ రాబోతున్నాడు.
చూడాలి మరి, ఓటీటీలో ఈ సంక్రాంతి సినిమాలకు రెస్పాన్స్ ఎలా వుండబోతోందో.! అన్నట్లు ఇటీవలే ధియేటర్లో సందడి చేసిన సందీప్ కిషన్ ‘మైఖేల్’ కూడా వుందండోయ్. 24న ‘మైఖేల్’ ఓటీటీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







