సంక్రాంతి బొమ్మలకి ఓటీటీ రెస్సాన్స్ ఎలా వుండబోతోందో.!
- February 21, 2023
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో ‘వీర సింహారెడ్డి’ ముందుగా వచ్చింది. మంచి ఓపెనింగ్స్ కొట్టేసింది. తర్వాత వచ్చిన వారసుడు రివర్స్ గేర్ వేసింది. ఇక ముచ్చటగా మూడో స్థానంలో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ గట్టిగా కొట్టాడు.
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫుల్ గ్రేస్ చూపించాడు. మాస్ రాజా రవితేజ కాంబినేషన్తో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అసలు సిసలు సంక్రాంతి సినిమాగా నిలిచింది.
ఇక ఇప్పుడు ఓటీటీ టైమొచ్చింది. ఓటీటీలో మొదటగా ‘వారసుడు’ రాబోతున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి ఈ సినిమా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. ఆ తర్వాతి రోజు నుంచి అనగా ఫిబ్రవరి 23న బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమా డిస్నీ హాట్ స్టార్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. సివరాఖరిగా ‘వీరయ్య’ రాబోతున్నాడు.
చూడాలి మరి, ఓటీటీలో ఈ సంక్రాంతి సినిమాలకు రెస్పాన్స్ ఎలా వుండబోతోందో.! అన్నట్లు ఇటీవలే ధియేటర్లో సందడి చేసిన సందీప్ కిషన్ ‘మైఖేల్’ కూడా వుందండోయ్. 24న ‘మైఖేల్’ ఓటీటీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









