తెలుగులో విలన్ పాత్రలు పోషిస్తా: సుధీర్ బాబు
- May 03, 2016
తెలుగులో విలన్ పాత్ర చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతం లేదంటున్నాడు టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు. సుధీర్బాబు విలన్గా నటించిన బాలీవుడ్ చిత్రం 'బాఘీ' ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ నటీనటులు ఫోన్ చేసి చిత్రంలోని తన నటనను మెచ్చుకున్నారని.. వారి ప్రశంసలు తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయని అంటున్నాడు.
సినీ కెరీర్ ప్రారంభంలో 'ఏం మాయ చేశావో' చిత్రంలోను చిన్న నెగిటివ్ పాత్రలో నటించానని తెలిపాడు. త్వరలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ జీవితం ఆధారంగా ఓ సినిమా నిర్మిస్తున్నారని.. అందులో గోపిచంద్ పాత్రలో తాను నటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్ర స్క్రిప్టు ప్రస్తుతం ప్రారంభదశలో ఉందని.. త్వరలోనే ఈ చిత్రం పూర్తి వివరాలను తెలియజేస్తామన్నాడు. తనకు బ్యాడ్మింటన్ బాగా వచ్చని ఆ పాత్రలో నటించడం కష్టమేమి కాదన్నాడు.
సుధీర్బాబు విలన్గా నటించిన బాలీవుడ్ చిత్రం 'బాఘీ' మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతుంది. చిత్రంలో బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించారు. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.45.30కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ తొలిరోజు వసూళ్లలో 'ఫ్యాన్', 'ఎయిర్లిఫ్ట్' తరువాత బాఘీ మూడో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







