భారత సైనికాధికారులపై నిఘాపెట్టిన ఐఎస్ఐ
- May 03, 2016
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత సైనిక అధికారులపై నిఘా పెట్టింది. స్మార్ట్ఫోన్లలోని గేమింగ్, మ్యూజిక్ అప్లికేషన్ల ద్వారా మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్ను చొప్పించి సమాచారం సేకరిస్తోందని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికోసం టాప్గన్, ఎంపీజంకీ, వీడీ జంకీ, టాకింగ్ ఫ్రాగ్ వంటి అప్లికేషన్లను వాడుకుంటోందని ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి తెలిపారు.
పాకిస్థానీ నిఘా ఏజన్సీలు ముఖ్యంగా ఎక్స్సర్వీస్మెన్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు. వారికి ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఎర చూపి వారిని వాడుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఐఎస్ఐ మాల్వేర్ మొబైల్ యాప్లను పంపిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆయన చెప్పారు. 2013-16 మధ్య కాలంలో దాదాపు ఏడుగురు ఎక్స్సర్వీస్మెన్ని గూఢచర్యం కేసుల్లో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







