భారత సైనికాధికారులపై నిఘాపెట్టిన ఐఎస్ఐ
- May 03, 2016
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత సైనిక అధికారులపై నిఘా పెట్టింది. స్మార్ట్ఫోన్లలోని గేమింగ్, మ్యూజిక్ అప్లికేషన్ల ద్వారా మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్ను చొప్పించి సమాచారం సేకరిస్తోందని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికోసం టాప్గన్, ఎంపీజంకీ, వీడీ జంకీ, టాకింగ్ ఫ్రాగ్ వంటి అప్లికేషన్లను వాడుకుంటోందని ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి తెలిపారు.
పాకిస్థానీ నిఘా ఏజన్సీలు ముఖ్యంగా ఎక్స్సర్వీస్మెన్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు. వారికి ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఎర చూపి వారిని వాడుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఐఎస్ఐ మాల్వేర్ మొబైల్ యాప్లను పంపిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆయన చెప్పారు. 2013-16 మధ్య కాలంలో దాదాపు ఏడుగురు ఎక్స్సర్వీస్మెన్ని గూఢచర్యం కేసుల్లో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









