ఏడ్చే పిల్లలున్న తల్లులకు సుభవార్త
- May 03, 2016
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే వారిని సముదాయించడంలో విమాన సిబ్బంది కూడా తల్లిదండ్రులకు సహాయపడుతుంటారు. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని ఎవరైనా పిల్లలు ఏడవకూడదనే కోరుకుంటారు. అలాంటిది ఈ ఎయిర్లైన్స్ మాత్రం పిల్లలు ఏడిస్తే డిస్కౌంట్ ఇస్తానంటోంది..
అమెరికాకి చెందిన జెట్బ్లూ ఎయిర్వేస్ ఈ ఆఫర్ను ప్రకటించింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులకి అదే ఎయిర్వేస్లో మరోసారి ప్రయాణించడానికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాదు పిల్లలు మళ్లీ ఏడిస్తే ఆ డిస్కౌంట్ కాస్తా 50 శాతం అవుతుంది. అలా నాలుగు సార్లు ఏడిస్తే ఇక ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది. మదర్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ను ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







