సినర్జీస్ ట్రైనింగ్ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కొనుగోలు ..
- May 03, 2016
2013లో ప్రారంభించిన వరుణ్ మల్హోత్రా న్యూయార్క్: భారత సంతతి వ్యాపారవేత్త, వరుణ్ మల్హోత్రాకు సంబంధించిన బిజినెస్ టెక్నాలజీ స్టార్టప్.. సినర్జీస్ ట్రైనింగ్ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కొనుగోలు చేసింది. సినర్జీస్ పేరుతో ఉన్న ఈ స్టార్టప్ను వరుణ్ మల్హోత్రా 2013లో ప్రారంభించారు. గూగుల్ యాప్స్ను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఈ స్టార్టప్ను అందుబాటులోకి తెచ్చారు. టొరంటో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ స్టార్టప్ కొనుగోలు డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను గూగుల్ వెల్లడించలేదు.క్లౌడ్ ఆధారిత కమ్యూనికేషన్స్ అందించేలా జీమెయిల్, క్యాలెండర్, డ్రైవ్, డాక్యుమెంట్స్తో కూడిన గూగుల్ యాప్స్ ప్రొడక్ట్ సూట్ను ప్రస్తుతం 20 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు, వాటి వినియోగదారులు వినియోగించుకుంటున్నారని గూగుల్ యాప్స్ సీనియర్ డెరైక్టర్(కార్యకలాపాలు) పీటర్ స్కాసిమర పేర్కొన్నారు.మరిన్ని వ్యాపార సంస్థలు ఈ గూగుల్ యాప్స్ సూట్ను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ సంస్థలు, ఈ సంస్థల వినియోగదారులకు వీటిని ఎలా వినియోగించుకోవాలో తెలిపే శిక్షణ ఆఫర్ల కోసం చూశామని పేర్కొన్నారు. దీనిని నెరవేర్చడానికి సినర్జీస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో గూగుల్ యాప్స్లో ఒక భాగంగా సినర్జీస్ను అందిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







