మార్చి 12 న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా
- February 24, 2023
హైదరాబాద్: మార్చి 12 న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. అదే రోజు రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో స్టేట్ బిజెపి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన సాగనుంది. నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చలు జరుగుతాయి. తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేతల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









