శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత
- February 25, 2023
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి ఎమిరేట్స్ EK528 విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద 823 గ్రాముల బంగారం పట్టుబడింది.దాని విలువ రూ.47 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.బంగారాన్ని పేస్టుగా మార్చి, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశాడని, దానిని లోదుస్తుల్లో దాచి తరలించే యత్నం చేశాడని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. సూడాన్ జాతీయులైన 23 మంది మహిళలు సూడాన్ నుంచి షార్జా మీదుగా గురువారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. దీంతో 14 కేజీల 906 గ్రాముల బంగారం లభించింది. దీనివిలువ రూ.7.89 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో ఆభరణాలను ఉంచి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







