తెలంగాణలో మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
- February 25, 2023
తెలంగాణ: కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ వేదింపులు భరించలేక ఈమె ఆత్మహత్య చేకోవాలని అనుకుంది. ప్రస్తుతం నిమ్స్ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వగా..ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం నింతుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మెడికో, ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ కారణంగా విద్యార్థి మృతి చెందాడో తెలియరాలేదు. కానీ మెడికల్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







