‘గ్రంధాలయం’: చిన్న సినిమానే కానీ, విషయమున్న సినిమా.!
- February 25, 2023
కొన్ని సినిమాలు విపరీతమైన హైప్తో ప్రేక్షకుల ముందుకొచ్చి బోల్తాకొడుతుంటాయ్. కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి అద్భుతమైన విజయాల్ని అందుకుంటుంటాయ్. స్టార్ హీరోల సినిమాలే, హిట్లు కొట్టాలన్న రూలేమీ లేదిక్కడ. ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి సినిమాలు పెద్ద విజయాల్ని అందుకున్నాయంటే, వాటి గురించి అందరూ మాట్లాడుకున్నారంటే, వాటిలో వున్న సరుకు అలాంటిది.
‘గ్రంథాలయం’ పేరుతో వస్తోన్న ఓ సినిమా గురించి కూడా చాప కింద నీరులా బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాలో విన్నూ మద్దిపాటి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ సాయి శివన్.
‘గరుడవేగ’ లాంటి సినిమాలకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు సాయి శివన్. ‘శేఖరం గారబ్బాయ్’ అనే సినిమాలో నటించాడు విన్నూ మద్దిపాటి. బ్యాక్ గ్రౌండ్తో పని లేదిక్కడ. సినిమాలో సత్తా వుంటే, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారంటూ ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ చేసిన నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ వ్యాఖ్యానించడం చిత్ర బృందానికి బోలెడంత కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లయ్యింది. దామోదర ప్రసాద్ మాటల్లో ఈ సినిమా కోసం టీమ్ పడ్డ కష్టం జెన్యూన్గా కనిపించింది.
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తోన్న ఈ ‘గ్రంధాలయం’ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







