24 గంటల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు
- February 26, 2023
అబుధాబి: ప్రవాసులు, నివాసితులు ఇంట్లోంచి కేవలం 24 గంటల్లోనే జనన, మరణ ధృవపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది యూఏఈ ప్రభుత్వం.ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సంబంధిత ధృవపత్రం జారీ చేయడం జరుగుతుంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ గురువారం ప్రకటించింది.దీని కోసం ప్రత్యేక డిజిటల్ సర్వీస్ను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో ఉంటాయని పేర్కొంది.ఇక సర్వీస్ పొందేందుకు వినియోగదారులు ఒక్కొ సర్టిఫికేట్కు 60 దిర్హాములు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.ఈ సేవల కారణంగా వినియోగదారుల సమయం వృథాకాకుండా ఉండడంతో పాటు అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదని, అది కూడా ఒక వర్కింగ్ డేలో సర్టిఫికేట్ జారీ కావడం అనేది నిజంగా అద్భుతం అని మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు.అత్యావసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన సమయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







