ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- January 09, 2026
దోహా: ఖతార్ సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ రెండు ఆన్లైన్ వేలాన్ని ప్రకటించింది. ఇందులో వెహికల్స్, ప్రాపర్టీలు ఉన్నాయి. జ్యుడీషియల్ ఎగ్జిక్యూషన్స్ అండ్ ఆక్షన్స్ అడ్మినిస్ట్రేషన్ వేలం నిర్వహిస్తుందని X పోస్ట్లో వెల్లడించింది. కోర్ట్ మజాదత్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్గా వేలం పాట నిర్వహించనున్నట్లు కౌన్సిల్ తెలిపింది.
ఆన్లైన్ వాహన వేలం జనవరి 11న సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఆసక్తిగల బిడ్డర్లు కోర్ట్ మజదత్ యాప్ ద్వారా సమీక్షించి బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు ఉదయం 9:30 నుండి ఉదయం 11 గంటల వరకు వివిధ ప్రదేశాలలో ఉన్న వాణిజ్య మాల్స్, నివాస సముదాయాలు, హోటల్ భవనాలను వేలం వేయనున్నారు.
కాగా, ఆస్తి వివరణలు, బిడ్డింగ్ విధానాలు మరియు రిజిస్ట్రేషన్ సహా రెండు వేలంపాటల పూర్తి వివరాలు కోర్ట్ మజదత్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయని.. మరింత సమాచారాన్ని కౌన్సిల్ అధికారిక ఛానెల్ల ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







