ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- January 09, 2026
దోహా: ఖతార్ సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ రెండు ఆన్లైన్ వేలాన్ని ప్రకటించింది. ఇందులో వెహికల్స్, ప్రాపర్టీలు ఉన్నాయి. జ్యుడీషియల్ ఎగ్జిక్యూషన్స్ అండ్ ఆక్షన్స్ అడ్మినిస్ట్రేషన్ వేలం నిర్వహిస్తుందని X పోస్ట్లో వెల్లడించింది. కోర్ట్ మజాదత్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్గా వేలం పాట నిర్వహించనున్నట్లు కౌన్సిల్ తెలిపింది.
ఆన్లైన్ వాహన వేలం జనవరి 11న సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఆసక్తిగల బిడ్డర్లు కోర్ట్ మజదత్ యాప్ ద్వారా సమీక్షించి బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు ఉదయం 9:30 నుండి ఉదయం 11 గంటల వరకు వివిధ ప్రదేశాలలో ఉన్న వాణిజ్య మాల్స్, నివాస సముదాయాలు, హోటల్ భవనాలను వేలం వేయనున్నారు.
కాగా, ఆస్తి వివరణలు, బిడ్డింగ్ విధానాలు మరియు రిజిస్ట్రేషన్ సహా రెండు వేలంపాటల పూర్తి వివరాలు కోర్ట్ మజదత్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయని.. మరింత సమాచారాన్ని కౌన్సిల్ అధికారిక ఛానెల్ల ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









