ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- January 09, 2026
యూఏఈ: ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాసింజర్ సేవలను ప్రారంభించడానికి ఇతిహాద్ రైల్ సిద్ధమవుతున్నది. యూఏఈ మొదటి జాతీయ రైల్వే నెట్వర్క్.. నగరాలను అనుసంధానించడంతోపాటు దేశంలో దాగి ఉన్న చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ప్రజలకు ఒక కొత్త రూట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ ప్యాసింజర్ రైలు నెట్వర్క్ యూఏఈ వ్యాప్తంగా 11 స్టేషన్లను కలుపుతుంది. ఇది సౌదీ సరిహద్దు సమీపంలోని అల్ సిలా నుండి షార్జాలోని అల్ ధైద్ వరకు, అబుదాబి పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు తీరంలోని ఫుజైరా వరకు నిర్మించారు. ఈ రైల్ నెట్ వర్క్ ఎడారి పట్టణాలు, తీరప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు మరియు చారిత్రక కట్టడాల గుండా వెళుతుంది . గతంలో ప్రకటించిన నాలుగు స్టేషన్లతో పాటు ఏడు కొత్త స్టేషన్లను తాజాగా ఆవిష్కరించారు.
అబుదాబిలోని అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న అల్ సిలా, అల్ ధన్నా, అల్ మిర్ఫా, మదీనత్ జాయెద్, మెజైరా, అబుదాబి, అల్ ఫయా, దుబాయ్, యూనివర్సిటీ సిటీ, అల్ ధైద్, సకమ్కామ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







