ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- January 09, 2026
యూఏఈ: ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాసింజర్ సేవలను ప్రారంభించడానికి ఇతిహాద్ రైల్ సిద్ధమవుతున్నది. యూఏఈ మొదటి జాతీయ రైల్వే నెట్వర్క్.. నగరాలను అనుసంధానించడంతోపాటు దేశంలో దాగి ఉన్న చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ప్రజలకు ఒక కొత్త రూట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ ప్యాసింజర్ రైలు నెట్వర్క్ యూఏఈ వ్యాప్తంగా 11 స్టేషన్లను కలుపుతుంది. ఇది సౌదీ సరిహద్దు సమీపంలోని అల్ సిలా నుండి షార్జాలోని అల్ ధైద్ వరకు, అబుదాబి పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు తీరంలోని ఫుజైరా వరకు నిర్మించారు. ఈ రైల్ నెట్ వర్క్ ఎడారి పట్టణాలు, తీరప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు మరియు చారిత్రక కట్టడాల గుండా వెళుతుంది . గతంలో ప్రకటించిన నాలుగు స్టేషన్లతో పాటు ఏడు కొత్త స్టేషన్లను తాజాగా ఆవిష్కరించారు.
అబుదాబిలోని అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న అల్ సిలా, అల్ ధన్నా, అల్ మిర్ఫా, మదీనత్ జాయెద్, మెజైరా, అబుదాబి, అల్ ఫయా, దుబాయ్, యూనివర్సిటీ సిటీ, అల్ ధైద్, సకమ్కామ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







