ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- January 09, 2026
యూఏఈ: ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాసింజర్ సేవలను ప్రారంభించడానికి ఇతిహాద్ రైల్ సిద్ధమవుతున్నది. యూఏఈ మొదటి జాతీయ రైల్వే నెట్వర్క్.. నగరాలను అనుసంధానించడంతోపాటు దేశంలో దాగి ఉన్న చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ప్రజలకు ఒక కొత్త రూట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ ప్యాసింజర్ రైలు నెట్వర్క్ యూఏఈ వ్యాప్తంగా 11 స్టేషన్లను కలుపుతుంది. ఇది సౌదీ సరిహద్దు సమీపంలోని అల్ సిలా నుండి షార్జాలోని అల్ ధైద్ వరకు, అబుదాబి పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు తీరంలోని ఫుజైరా వరకు నిర్మించారు. ఈ రైల్ నెట్ వర్క్ ఎడారి పట్టణాలు, తీరప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు మరియు చారిత్రక కట్టడాల గుండా వెళుతుంది . గతంలో ప్రకటించిన నాలుగు స్టేషన్లతో పాటు ఏడు కొత్త స్టేషన్లను తాజాగా ఆవిష్కరించారు.
అబుదాబిలోని అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న అల్ సిలా, అల్ ధన్నా, అల్ మిర్ఫా, మదీనత్ జాయెద్, మెజైరా, అబుదాబి, అల్ ఫయా, దుబాయ్, యూనివర్సిటీ సిటీ, అల్ ధైద్, సకమ్కామ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









