తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- January 09, 2026
హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టింది. జనవరి 7 నుంచి ఇప్పటి వరకు 75 ప్రైవేట్ బస్సుల పై నిబంధనల ఉల్లంఘనలకుగాను కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల పూర్తి జాబితా నిర్వహించకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి మౌలిక భద్రతా సదుపాయాలు లేకపోవడం వంటి పలు లోపాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎనిమిది బృందాలు బస్సు డిపోలు, ప్రధాన రహదారులు, బస్టాండ్ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పండుగ సమయంలో ప్రయాణించే ప్రజల భద్రతకు ఎలాంటి రాజీ ఉండదని రవాణా శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైతే అనుమతులు రద్దు చేసే చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









